Ts Government: ఫామ్ హౌస్ కేసులో సిట్ ఏర్పాటు

by srinivas |   ( Updated:2022-11-09 13:09:22.0  )
Ts Government: ఫామ్ హౌస్ కేసులో సిట్ ఏర్పాటు
X

దిశ వెబ్ డెస్క్: ఫామ్ హౌస్ కేసుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన సిట్ ఏర్పాటు చేసింది. ఆరుగురు పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సిట్‌లో సీవీ ఆనంద్‌తో పాటు నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ కల్మేశ్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డి ఉండనున్నారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ పోలీసులు.. కేసు విచారణలో మరింత దూకుడు పెంచారు. కేసు విచారణకు అటు హైకోర్టు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మరింత లోతుగా విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, సోమయాజులు స్వామి, నందకిషోర్‌ను సిట్ ప్రశ్నించనుంది. దీంతో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.



Next Story

Most Viewed