నిరుద్యోగులకు సింగరేణి శుభవార్త

by Disha Web Desk 22 |
నిరుద్యోగులకు సింగరేణి శుభవార్త
X

దిశ, ఆదిలాబాద్ బ్యూరో: సింగరేణి సంస్థ నుంచి మరో ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా 327 పోస్టులను భర్తీ చేయనుంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. నిరుద్యోగులకు సింగరేణి సంస్థ మరో గుడ్ న్యూస్ చెప్పింది. 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ ఇంజనీర్ ట్రైనీ, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ, ఫిట్టర్ ట్రైనీ, ఎలక్ట్రిషియన్ ట్రైనీ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 4వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. https://scclmines.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.

Next Story