'శ్రీకాంతాచారి అమరుడైతే.. హరీష్ మంత్రి అయ్యాడు'

by Dishanational2 |
శ్రీకాంతాచారి అమరుడైతే.. హరీష్ మంత్రి అయ్యాడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేసీఆర్ కుటుంబం అంతా డ్రామాలు ఆడుతున్నారు. వారి కుటుంబానికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా నటిస్తున్నారని విమర్శలు గుప్పించారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా లిబర్టీ సర్కిల్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన షర్మిల..అనంతరం మీడియాతో మాట్లాడారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ ఆ మాట తప్పారన్నారు. పదిశాతం కూడా దలితబందు ఇవ్వలేదని ఆరోపించారు. మన రాష్ట్రం సాధించుకుందే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లేనని.. అలాంటిది దళితులను కేసీఆర్ కనీసం పక్కన కూడా పెట్టుకోడని..దళితులను తక్కువగా చూడడం కేసీఆర్ నైజం అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబసభ్యులకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా నటిస్తున్నారు. వారికి ఆస్కార్ ఇవ్వాలని సెటైర్లు వేశారు. మంత్రి హరీష్ రావు బోగస్ మాటలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యమంలో హరీష్ రావు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె మర్చిపోయినట్టు నాటకాలు ఆడాడన్నారు. కానీ, శ్రీకాంతా చారి అగ్గిపెట్టె తెచ్చుకొని అమరుడైతే హరీష్ అగ్గిపెట్టె మర్చిపోతే మంత్రి అయ్యాడని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోందని షర్మిల వ్యాఖ్యానించారు.

కవితమ్మ అమాయకంగా బతుకమ్మ ఆడుతూనే లిక్కర్ స్కాంకి తెరలేపిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో నాటకానికి తెర లేపుతున్నారు. కేసీఆర్ మాటల్లో ఉన్న చిత్తశుద్ది చేతల్లో కనపడడం లేదని ఎద్దేవా చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి అంబేడ్కర్ పేరు పెడితే కేసీఆర్ దాన్ని తీసేసారని మండిపడ్డారు.

రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ అంబేడ్కర్‌ని అవమానపర్చాడన్నారు. కేసీఆర్ చేసిన వాగ్ధానాలు నెరవేర్చడానికి రాజ్యాంగం అడ్డు వచ్చిందా? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ఎందుకు మార్చాలో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం అనేది మన దేశాన్ని నడిపిస్తున్న ఇంధనం అని షర్మిల వ్యాఖ్యానించారు. తెలంగాణలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలవడం లేదని.. కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ అంటే (కే అంటే కొట్టి సీ అంటే చంపే అర్ అంటే రాజ్యాంగం) అని సెటైర్లు వేశారు. కేసీఆర్ రాజ్యాంగంలో ప్రజల కోసం కోట్లాడే వారు ఉండొద్దు అని ఉందన్నారు. ప్రజల కోసం నిలబడే వాళ్ళని నల్లిని నలిపినట్టు నలిపేయాలని, మహిళ బట్టలు చింపాలి, పెట్రోల్ బాంబులతో దాడి చేయాలని కేసీఆర్ రాజ్యాంగంలో ఉందన్నారు. పోలీసులను తమ సొంత పార్టీ మనుషులలాగా వాడుకోవాలని కేవలం కేసీఆర్ రాజ్యాంగంలోనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. కేసీఆర్ ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు. కేసీఆర్ నియంత పోవాలని ప్రజలు నిర్ణయించుకోవాలి. తెలంగాణలో ప్రజల ప్రభుత్వం రావాలని షర్మిల అన్నారు. కాగా, తన అరెస్ట్ పట్ల సానుభూతి వ్యక్తం చేసిన మోడీ జీ కి, అందరికీ థాంక్స్ చెప్పారు.

ఇవి కూడా చదవండి : YS షర్మిలకు Prime Minister Narendra Modi ఫోన్


Next Story

Most Viewed