ఎన్నికల వేళ కాంగ్రెస్ బీసీ లీడర్ల సంచలన తీర్మానం..

by Rajesh |
ఎన్నికల వేళ కాంగ్రెస్ బీసీ లీడర్ల సంచలన తీర్మానం..
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీసీలకు సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా కాపాడుకోవాలని ఆయా నేతలు తీర్మానించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ లీడర్లంతా ఢిల్లీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.జనాభా దమాషా ప్రకారం సీట్లు తీసుకోవాల్సిందేనని నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. బీసీ లీడర్లంతా ఏకమై హైకమాండ్ పై ప్రెజర్ తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ మీటింగ్ లో మాజీ పీసీసీ చీఫ్​విహెచ్, మధుయాష్కీ గౌడ్ , పొన్నాల, పొన్నం ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బీసీలకు 34 సీట్లు ఇస్తామని పార్టీ హామీ ఇవ్వగా...48 సీట్లను లీడర్లు అడుగుతున్నారు. కానీ పార్టీ ఇప్పటి వరకు బీసీ సీట్ల అంశాన్ని ఫైనల్ చేయలేదు.



Next Story

Most Viewed