- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కేసీఆర్ కనుసన్నల్లో కామ్రేడ్లు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన కామెంట్స్

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుణంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటనను సీఎం కేసీఆర్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తు్న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఆశలను కేసీఆర్ అడ్డుకుంటున్నారని, ద్రోహులకు పెద్దపీట వేస్తున్నారంటూ లక్ష్మణ్ మండిపడ్డారు. మునుగోడు ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టి గెలిచామని టీఆర్ఎస్ అనిపించుకుంటుందని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతి పనులను ఎదుర్కొనే సామర్థ్యం బీజేపీకి ఉన్నదని వ్యాఖ్యానించారు. అందుకే మునుగోడులో 40% ఓట్లు బీజేపీకి వేశారని లక్ష్మణ్ అన్నారు. ఇక, కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందంటూ విమర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. కేంద్ర నిధులు సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారని, ఈనెల 11, 12 తేదీల్లో విశాఖపట్నం, తెలంగాణలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఈ సదర్భంగా కేసీఆర్ బీజేపీని, మోడీని రాజకీయంగా ఎదుర్కోలేక తెలంగాణలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు కేసీఆర్ నిలబెట్టుకోవడం లేదని.. అభివృద్ధి కార్యక్రమాలకు బోధపడుతుంటే ప్రధాని పర్యటన అడ్డుకుంటామని కేసీఆర్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6000 కోట్ల పైచిలుకు నిధులతో పునరుద్ధరించినట్లు తెలిపారు. దాన్ని జాతికి అంకితం చేసేందుకు ప్రధాని వస్తుంటే అడ్డుకుంటామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని, మోడీని ఎదుర్కోలేక కేసీఆర్ కుట్రలు చేస్తు్న్నారని లక్ష్మణ్ విమర్శించారు.
కేసీఆర్ కనుసనల్లో లెఫ్ట్ పార్టీ నేతలు
మునుగోడులో కమ్యూనిస్టుల సహకారంతోనే కేసీఆర్ గెలుపొందారని అన్నారు. కమ్యూనిస్టులకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కేసీఆర్ దొరికారంటూ విమర్శించారు. కామ్రేడ్లు సీఎం కేసీఆర్ కనుసన్నల్లో ఉన్నారని లక్ష్మణ్ అన్నారు. ప్రజలు వీటన్నింటిని అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మూడేళ్ల నుంచి తెలంగాణలో నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండానే సింగరేణి ప్రైవేటీకరణం అవుతుందా అని ప్రశ్నించారు. సింగరేణిని లాభాల బాటలు నడిపిస్తుంటే వారికి న్యాయపరమైన డిమాండ్ నెరవేర్చకుండా బోనస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని.. వీటిని ఎందుకు కామ్రేడ్లు నిలదీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హింసను ప్రేరేపించే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వీటిలో కమ్యూనిస్టులు చలి కాల్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎరువుల కర్మాగారం ఓపెన్ చేస్తుంటే కేసీఆర్కి వచ్చిన కడుపు మంట ఏంటని ప్రశ్నించారు. దేశంలోనే రైతులు ఆత్మహత్య చేసుకునే రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగువ స్థానంలో ఉందని గుర్తు చేశారు. రైతులు సబ్సిడీ ఇవ్వాలని కోరుతుంటే తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేసి చోద్యం చూస్తుందని అన్నారు. కాలేశ్వరం అబాసు పాలైందని..30 వేల కోట్ల ప్రాజెక్టును 1,20,000 కోట్లకు పెంచారంటూ ఆరోపించారు. రైతుల నడ్డి విరిచే ప్రయత్నం కేసీఆర్ చేశారని మండిపడ్డారు. మిషన్ భగీరథ ఫేర్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందన్నారు. ఉద్యోగుల నోటిఫికేషన్ ఇవ్వకుండా అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దాని కారణం ప్రభుత్వం. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన టీఆర్ఎస్ ఇప్పుడు ఊరికే ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితి ఎదురైందని విమర్శించారు.
ఇవి కూడా చదవండి : మునుగోడు గెలుపు బీజేపీకి చెంపపెట్టు : మంద జగన్నాథం