కాంగ్రెస్ ​పార్టీ మరోసారి నిరసనలు.. అక్కడ సత్యాగ్రహ దీక్ష

by Disha Web Desk 13 |
కాంగ్రెస్ ​పార్టీ మరోసారి నిరసనలు.. అక్కడ సత్యాగ్రహ దీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీని అప్రజాస్వామికంగా పార్లమెంట్ మెంబర్ గా తొలగించినందుకు కాంగ్రెస్ ​పార్టీ మరోసారి నిరసనలు చేపట్టనున్నది. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ఈ నెల 27న గాంధీభవన్​లో ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల వరకు సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ ​కుమార్ ​గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ దీక్షలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జాతీయ అధ్యక్షులు మీనాక్షీ నటరాజన్ తదితరులు పాల్గొననున్నారు.

Next Story