మే 15 నుంచి తెలంగాణలో పుష్కరాలు.. వెబ్ సైట్ లాంచ్

by Veldandi saikiran |   ( Updated:2025-04-15 12:52:09.0  )
మే 15 నుంచి తెలంగాణలో పుష్కరాలు.. వెబ్ సైట్ లాంచ్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. మే 15 తేదీ 2025 నుంచి తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి. ఈ తరుణంలోనే సరస్వతి పుష్కరాలు ( Saraswati Pushkaram) వె‌బ్‌సైట్ లాంఛ్ చేశారు. సరస్వతి పుష్కర్ - 2025 ( Saraswati Pushkar - 2025)వెబ్ పోర్టల్ , మొబైల్ యాప్ ను తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ ప్రారంభించారు. మే 15వ తేదీ 2025 నుంచి 26 మే 2025 వరకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో పుష్కరాలు జరుగనున్నాయి.

సరస్వతి పుష్కరాలు ( Saraswati Pushkaralu) అనేవి... ప్రతి 12 సంవత్సరాలకు ఒక సారి జరుగుతాయి. సరస్వతి నదికి సంబంధించిన పవిత్రమైన పండగే ఈ పుష్కరాలు. ఈ పుష్కరాలు సాధారణంగా గృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి... దాదాపు 12 రోజుల పాటు జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం 2025 సరస్వతి పుష్కరాలు... మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కొనసాగుతాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ( Jayashankar Bhupalapally) కాళేశ్వరం క్షేత్రంలో ఈ పుష్కరాలు జరగబోతున్నాయి. ఈ సరస్వతి పుష్కరాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ( telangana govt) ఇప్పటికే 25 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ పుష్కరాలకు సంబంధించిన పనులు కూడా చక చకా జరుగుతున్నాయి. ఈ పుష్కరాలకు తెలంగాణతో ( Telanagan ) పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. ఇందులో భాగంగానే ఇవాళ వెబ్ సైట్ కూడా లాంచ్ చేశారు.



Next Story

Most Viewed