శివాలయాన్ని శుభ్రం చేసిన బండి సంజయ్ (వీడియో వైరల్)

by Disha Web Desk 1 |
శివాలయాన్ని శుభ్రం చేసిన బండి సంజయ్ (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మికను అలవరచుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఇవాళ కరీంనగర్ పట్టణంలోని పద్మనగర్‌లో ఉన్న శివాలయ గర్భగుడిని ఆయన శుభ్రం చేశారు. అనంతరం ఓ చేత్తో పైపు, మరో చేత్తో వైపర్ చేతబట్టి ఆయన పరిసరాలను కూడా క్లీన్ చేశారు. అనంతర ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలను సంరక్షించుకునే బాధ్యత హిందులవులందరిపై ఉందని అన్నారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రజలంతా ఆ సక్తిగా ఎదరుచూస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోని ప్రజలంతా స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలోని పాల్గొని పుణ్యక్షేత్రాలను శుభ్రం చేయాలంటూ ప్రధాని మోడీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు.


Next Story

Most Viewed