- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అంగన్వాడీలో రబ్బరు కోడిగుడ్లు.. గర్భిణీ వాంతులు కావడంతో..

X
దిశ, కల్లూరు : అంగన్వాడీలో రబ్బరు కోడిగుడ్లను అందిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆహారం తీసుకున్న గర్భిణి అనారోగ్యం పాలవడంతో విషయం బయటకొచ్చింది. ఈ ఘటన కల్లూరులోని తల్లాడ మండలం లక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ మేరకు గ్రామస్తులు కల్లూరు సిడిపిఓకు ఫిర్యాదు చేశారు. రబ్బరు కోడిగుడ్లు తినడంతో మంగళవారం గర్భిణీ స్త్రీకి వాంతులు విరేచనాలు అయ్యాయి. దాంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. ఆ కోడి గుడ్లు తినడం వలన వాంతులు-విరేచనాలు అయ్యాయనిని వైద్యులు తెలిపారు. దాంతో గ్రామస్తులు కల్లూరు సీడీపీఓ కృష్ణకుమారికి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రామకృష్ణా రెడ్డి, మాధవరెడ్డి,వెంకట కృష్ణారెడ్డి, శీలం వెంకట నారాయణ రెడ్డి, ముత్తా రెడ్డి లు ఫిర్యాదు చేశారు.
Next Story