- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మునుగోడు గెలుపులో మా ఓట్లే కీలకం.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: రాజిరెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపులో ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యుల ఓట్లు కీలకంగా ఉన్నాయని మునుగోడు నియోజకవర్గం ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ రాజిరెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాలని పిలుపు నిచ్చామని చెప్పారు. పెండింగ్ సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినందున సమాఖ్య జనరల్ సమావేశం ప్రభుత్వానికి మద్దతు ప్రకటించచామన్నారు. ఆదివారం హయత్నగర్ 1, 2 డిపోల వద్ద జరిగిన కార్మికులు స్వీట్లు పంచి బాణాసంచా కాల్చి విజయోత్సవాలు జరుపుకుని నాయకత్వాన్ని స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు యూనియన్లకు అనుమతించాలని, పే స్కేల్ అమలు చేయాలని, 2013 వేతన సవరణ బాండ్ల డబ్బులు చెల్లించాలని, సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్యను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమాఖ్య నాయకత్వాన్నీ ప్రగతి భవన్కు పిలిపించి చర్యలు జరిపి కొన్ని సమస్యలు పరిష్కారం చేయడం జరిగిందని, పే స్కేల్ అమలు చేయడానికి ఎన్నికల కమిషన్కు అనుమతికై లెటర్ రాయడం జరిగిందన్నారు. అలాగే యూనియన్లను అనుమతిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పి క్రిష్ణయ్య, బీజేఎం రెడ్డి, ఎంబీ చారి, ఈద శంకరయ్య, కత్తుల యాదయ్య, సుర్కంటి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.