కీరవాణి పెత్తనం ఏంది బై.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ట్వీట్

by Rajesh |
కీరవాణి పెత్తనం ఏంది బై.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఈ వేడుకల్లో జయజయహే తెలంగాణ పాటను అధికార రాష్ట్ర ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతాన్ని అందించనున్నారు. ఈ అంశం వివాదాస్పదం అయింది. ఏపీకి చెందిన సంగీత దర్శకుడితో మ్యూజిక్ చేయించడం ఏంటని సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఖండించింది. తాజాగా.. బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ‘అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా' సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి పెత్తనం ఏంది భై ? గీత స్వరకల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరమొచ్చింది?? అయినా తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలం? అదీ తెలంగాణ వచ్చి పదేళ్లయినంక??

కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇదీ ‘నాటు నాటు’ పాట కాదు అని రేవంత్ రెడ్డి గుర్తించుకోవాలి. నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వందలాది మంది అమరుల త్యాగాలు, నాలుగు కోట్ల ప్రజల కలల ప్రతి రూపం. ఒక రణ నినాదం. ధిక్కార స్వరం. అందెశ్రీ గారిచ్చిన ఒరిజినల్ ట్యూన్‌తోనే ఈ గీతాన్ని యావత్తు తెలంగాణ ఆనాడు ఆలపించింది. ఉస్మానియా యూనివర్సిటీ లో జనవరి 3, 2011 విద్యార్థి గర్జనలో లక్షలాది మంది ప్రజలు ఈ గీతాన్ని సామూహికంగా ఆలాపించిన తీరు చూసుంటే మీరు ఈ దుస్సాహసం చేయరు. మీరప్పుడు అక్కడ ఉండే అవకాశం లేదు కాబట్టి బహుశా మీకిది తెల్వదు. నేనారోజు అక్కడ ఉన్న కాబట్టి చెబుతున్న.’ అని ట్వీట్ చేశారు.పాపం అందెశ్రీ అమాయకుడు, నిస్సహాయుడు కాబట్టి మౌనంగా కూర్చున్నడు. మీరేం చేసినా భరిస్తున్నడు అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలారా, జూన్ 2 నాడు ఆంధ్ర సంగీతకారులు స్వరకల్పన చేసిన మన తెలంగాణ గీతాన్ని పాడుకుందమా, లేక మన ఒరిజినల్ గీతాన్నే పాడుకుందమా?? అని ప్రశ్నించారు.



Next Story

Most Viewed