- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆర్ఎంసీ మీటింగ్ మళ్లీ వాయిదా..
దిశ, తెలంగాణ బ్యూరో : గత కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తోన్న ఆర్ఎంసీ (రిజర్వాయరు మేనేజ్మెంట్ కమిటీ సమావేశం మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 28న కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ విచారణ జరగనున్న నేపథ్యంలో వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఈ మేరకు కేఆర్ఎంబీ.. ఆర్ఎంసీ మీటింగ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. గత కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న కమిటీ ఐదో సమావేశం ఈ నెల 27వ తేదీన జరగాల్సి ఉంది. అయితే మరుసటి రోజు నుంచి కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ విచారణ జరగనున్నట్లు అధికారులు చెప్తున్నారు.
ఆర్ఎంసీ మీటింగ్ పై ఇప్పటికే రెండు రాష్ట్రాల అధికారులు, ఇంజినీర్లు దృష్టి సారించారు. అయితే, ట్రైబ్యునల్ విచారణ నేపథ్యంలో 27న జరగాల్సిన ఆర్ఎంసీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ గతంలోనే కోరారు. ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్యుడు, ఆర్ఎంసీ కన్వీనర్కు ఆయన లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఆర్ఎంసీ మీటింగ్ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
కాగా, మైలవరం బ్రాంచ్ కాల్వకు వెంటనే మరమ్మత్తులు పూర్తి చేసేలా చూడాలని, నాగార్జునసాగర్ చివరి ఆయకట్టులో ఉన్న ఏపీ పొలాలకు సాగు నీరు అందాలంటే ఖమ్మం సీఈ పరిధిలోని మైలవరం బ్రాంచ్ కెనాల్ కు మరమ్మత్తులు చేసి పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శికి గురువారం లేఖ రాశారు.