సిగ్గు, సిగ్గు.. అంటూ ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి

by Dishanational2 |
సిగ్గు, సిగ్గు.. అంటూ ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రారంభం కాకముందే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనుచరుల బేరసారాలు చేస్తున్నారు. దీంతో, ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీనేతల ఇళ్ల ముందు ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను ట్యాగ్ చేస్తూ టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారి అనుచరుల ఆగడాలపై రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. 'సబ్‌ప్లాన్‌కు మంగళం పాడారు.. మూడెకరాలిస్తామని మొండి చేయి చూపారు.. దళితబంధు ఇచ్చేదే గుప్పెడు మందికి.. శవాలను పీక్కుతినే రాబందుల్లా అందులోనూ గులాబీ ముఠాకు కమీషన్లా..!? సిగ్గు సిగ్గు.. ' అంటూ ట్వీట్ చేశారు.


Next Story

Most Viewed