- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
నేను బతికే ఉన్న సారూ.. బతికున్న 70 ఏళ్ల వృద్ధుడు చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు

దిశ, డైనమిక్ బ్యూరో : ‘సారు నేను బతికే ఉన్నా కదా..చనిపోయానని రికార్డుల్లో రాసుకున్నారేంటి’అంటూ ఓ 70 ఏళ్ల వృద్ధుడు అమాయకంగా ప్రశ్నించిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆవేదనకు గురిచేస్తోంది. ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛన్ కోసం ఓ పండు ముసలి కన్నీరు పెట్టుకుంటున్న తీరు కలచివేస్తోంది. ఓ ప్రభుత్వ అధికారి నిర్లక్ష్యం మూలంగా బతికుండగానే చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో 70 ఏళ్ల వయసులో ఫించను అందడం లేదని, తాను బతికే ఉన్నానని ఎలా నిరూపించుకోవాలో తెలీక అవస్థలు పడుతున్నాడు. ఝార్ఖండ్ బొకారో జిల్లాలోని బాగ్దా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఖేదాన్ ఘాన్సీ (70) గత కొన్నేళ్లుగా ప్రభుత్వ అందించే వృద్ధాప్య పింఛను తీసుకుంటున్నాడు. అయితే, గతేడాది సెప్టెంబర్నుంచి అధికారులు పెన్షన్ నిలిపేశారు.
దీంతో పింఛను ఎందుకు రావడం లేదో తెలీక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి ఖేదాన్ ఘాన్సీ ఆరా తీశాడు. అతడు మరణించినట్లుగా రికార్డుల్లో అధికారులు ఎక్కించినట్లు తెలిసింది. దీంతో ఏం చేయాలో పాలుపోక జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నాడు. సారూ.. నేను ఇంకా బతికే ఉన్న కదా.. చనిపోయానని రికార్డుల్లో అలా ఎలా రాసుకున్నారంటూ అమాయకంగా ప్రశ్నించాడు. వృద్ధుడి ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పకపోగా.. బతికే ఉన్నట్లుగా ధ్రువీకరణ పత్రం తీసుకురమ్మంటూ వృద్ధుడికి చెప్పారు. చనిపోతే డెత్సర్టిఫికేట్ ఉంటుంది కానీ.. బతికున్నట్లు సర్టిఫికేట్ ఎక్కడ నుంచి తీసుకురావాలో అతనికి పాలుపోలేదు. ఈ వంకతో గత 9 నెలలుగా పింఛను ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీంతో అధికారులు కావాలనే తన ఫించన్ నిలిపివేశారని ఆరోపిస్తూ జిల్లా ఉన్నతాధికారి విజయ్కుమార్కు లేఖ రాశాడు. ‘బతికే ఉన్నా.. చనిపోయినట్లుగా రికార్డుల్లో ఎలా నమోదు చేస్తారు..? తక్షణమే అతడికి పింఛను తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోండి. 2022 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు ఆగిపోయిన మొత్తం పెన్షన్ సొమ్మును చెల్లించండి’ అంటూ అధికారులను ఆదేశించాడు. బీడీఓ స్థాయి అధికారి స్వయంగా ఆదేశించినా అధికారులు ఇంతవరకూ ఆ వృద్ధుడికి పింఛన్ను పునరుద్ధరించకపోవడం గమనార్హం.