వివాహిత మహిళ అదృశ్యం

by Disha Web Desk 20 |
వివాహిత మహిళ అదృశ్యం
X

దిశ, మొయినాబాద్ : వివాహిత మహిళ అదృష్యమైన సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, మొయినాబాద్ పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని యేనికేపల్లి గ్రామానికి చెందిన ఖానాపూర్ అనసూయ కుటుంబకలహాలతో ఈనెల 4వ తేదీ సాయంత్రం ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఎంతకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుప్రక్కల వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె కుమారుడు కానాపురం రజనీకాంత్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు మొయినాబాద్ సీఐ లక్షిరెడ్డి తెలిపారు.


Next Story

Most Viewed