- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
హై టెన్షన్ కింద భవన నిర్మాణం.. నిబంధనలు ఎక్కడ..?
by Sumithra |

X
దిశ, ఇబ్రహీంపట్నం : నిబంధనలను తుంగలో తొక్కి హైటెన్షన్ వైర్ల క్రింద భవన నిర్మాణం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల మున్సిపాలిటీ టీసీఎస్ దగ్గరలో 132 కేవీ విద్యుత్ హై టెన్షన లైన్లను ఏర్పాటు చేశారు. కాగా ఆయా హైటెన్షన లైన్లకు సంబంధించి ట్రాన్స్కో నిబంధనల ప్రకారం నిర్మాణాలు, రహదారులు చేపట్టకూడదు. కానీ ప్రస్తుతం అక్కడ ఎలాంటి అనుమతులు, నిబంధనలు లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ఇండ్లు నిర్మించినా కానీ ఆదిభట్ల మున్సిపాలిటీ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ ప్రాంతాల్లో అసలు అనుమతులే ఉండవంటే.. కొందరు ఏకంగా షెడ్డులే వేసేస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాల వెనుక అధికారుల ప్రమేయం ఏ మేరకు ఉందో అర్థమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Next Story