- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రెండు లక్షల మెజారిటీతో గెలుస్తున్నాం : కొండా
దిశ, సరూర్ నగర్ : ఫేక్ వీడియోస్ తో ఎప్పటికీ విజయం సాధించలేరని చేవెళ్ల బిజెపి పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సరూర్నగర్ డివిజన్లో రోడ్ షోలో పాల్గొన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ …రాష్ట్రంలో ఖజానా లేక ఇవ్వవలసిన ఆరు గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల లోన్ తీసుకుందాని వెల్లడించారు.
అయినప్పటికీ ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా ఇవ్వలేదు. మాటలు మార్చి, మోడీపై, బిజెపి ప్రభుత్వంపై బురద జల్లితే కాంగ్రెస్ గెలవలేదని కొండా అన్నారు. బిజెపికి ఓటు వేస్తే అభివృద్ధికి ఓటు వేసినట్టేనని అన్నారు. అందరూ తప్పకుండా రెండవ నెంబర్ కమలం గుర్తుకు ఓటు వేయాలని కొండా వేడుకున్నారు. చేవెళ్లలో రెండవసారి రెండు లక్షల మెజారిటీతో గెలవబోతున్నామని కొండా అన్నారు. ఈ రోడ్ షో లో మహేశ్వరం ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్, సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, వందల సంఖ్యలో బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.