- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తీగల వాగు కబ్జా
దిశ, శంకర్ పల్లి : తీగల వాగు కబ్జాకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. లెగసి వెంచర్ యజమాని తీగల వాగులో నుంచి రోడ్డును వేసిన అధికారులు తీసుకోకపోవడంపై తీవ్ర అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. తీగల వాగులో చిన్నపాటి కల్వర్టును నిర్మించి అక్రమంగా రోడ్డు వేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం పై పలు అనుమానాలు కలుగుతున్నాయి. శంకర్ పల్లి పట్టణ కేంద్రంలో చేవెళ్ల ప్రధాన రోడ్డును కలుపుతూ తీగల వాగు లో నుంచి రైల్వే బ్రిడ్జి కిందగా లెగసి విలేజ్ వెంచర్ వారు రోడ్డును వేయడం పై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీగల వాగులో నుంచి దర్జాగా రోడ్డును వేసిన నీటిపారుదల , మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎప్పటికైనా మొద్దు నిద్ర మేల్కొని తీగల వాగు ను కాపాడాలంటూ పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై నీటిపారుదల శాఖ ఏ ఈ రాధికను వివరణ కోరగా అనుమతి లేకుండానే కల్వర్టును నిర్మించి రోడ్డు వేశారు. రోడ్డును పరిశీలించి చర్యలు తీసుకుంటామాని సమాధానం ఇచ్చారు