కెమికల్ వ్యర్థాలతో దుర్గంధం...

by Kalyani |
కెమికల్ వ్యర్థాలతో దుర్గంధం...
X

దిశ,మాడ్గుల : మాడ్గుల మండలం సుద్దపల్లి గ్రామ పరిధిలోని రమణంపల్లి రెవెన్యూ శివారులోని హైదరాబాద్, నాగార్జున సాగర్ హైవే పక్కన కెమికల్ ఫ్యాక్టరీ వ్యర్ధాలు గుర్తుతెలియని వ్యక్తులు ట్యాంకర్లలో తీసుకువచ్చి వేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. అర్ధరాత్రి ట్యాంకర్లలో తెచ్చిన వ్యర్థాలను హైవే పక్కన ఉన్న పొలాల్లో వేస్తుండడంతో పరిసరాలు దుర్గంధం వెదజల్లడం తో పాటు భూగర్భ జలాలు కలుషితం గా మారి బోరుబావుల నుంచి కలుషిత నీరు వస్తుందని ఆనీటిని తాగిన వారికి వాంతులు విరోచనాలు అయ్యి ఆసుపత్రుల పాలు అవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కెమికల్ వ్యర్థాలను తీసుకు వస్తున్న వారిపై చర్యలు తీసుకొని తమ ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed