టీడీపీ పూర్వ వైభవానికి కృషి చేయాలి : బక్కని నర్సింహులు

by Disha Web Desk 23 |
టీడీపీ పూర్వ వైభవానికి కృషి చేయాలి : బక్కని నర్సింహులు
X

దిశ , కేశంపేట్ : తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవడానికి కార్యకర్తలు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు పిలుపునిచ్చారు. మండలం లోని కొత్తపేట గ్రామంలో సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. అనంతరం బక్కని నర్సింహులు మాట్లాడుతూ.. స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బడుగు బలహీనవర్గాల ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్య్రాలు అందించాలనే ఉద్దేశంతో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మాండలిక వ్యవస్థను తీసుకు వచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఎన్టీఆర్ , చంద్రబాబు నాయుడు లకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతుందని ప్రజల వద్దకే పాలకులు వచ్చి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చుక్క శేఖర్ గౌడ్, పుట్నాల పాండు , గణేష్ , లింగం, జనార్ధన్ , కేశవులు, రమేష్, రాజు, అమరేష్ , బాలు , లక్ష్మయ్య పాల్గొన్నారు.


Next Story

Most Viewed