బీఆర్​ఎస్​ అవిశ్వాస తీర్మానానికి మొగ్గుచూపుతుందా ?

by Disha Web Desk 20 |
బీఆర్​ఎస్​ అవిశ్వాస తీర్మానానికి మొగ్గుచూపుతుందా ?
X

దిశ, బడంగ్​పేట్​ : బడంగ్​పేట్​ కార్పొరేషన్​లో అవిశ్వాస తీర్మానం అంశం తెరమీదకు రావడంతో మహేశ్వరం నియోజకవర్గం అంతటా చర్చనీయాంశంగా మారింది. కార్పొరేషన్​లో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపధ్యంలో అవిశ్వాస తీర్మానం కోసం చర్చలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ, సంఖ్యా బలంలేనప్పటికీ అవిశ్వాసం పెట్టబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాదర్​గూల్​లోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం కార్పొటరేటర్​లతో కలిసి కార్పొరేషన్​ బీజేపీ అధ్యక్షుడు భేటీ అయినట్లు తెలుస్తుంది. తదుపరి కార్యాచరణ సోమవారం జరిగే మీడియా సమావేశంలో బీజేపీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరో వైపు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏరి కోరి తెచ్చుకుని మేయర్​ పీఠంపై కూర్చోబెట్టిన చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి బీఆర్​ఎస్​ ను వీడి తిరిగి కాంగ్రెస్​ పార్టీలో చేరినా బీఆర్​ఎస్​ కార్పొరేటర్లకు అవిశ్వాసం పెట్టమని ఎందుకు చెప్పడం లేదని, కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలు రెండు ఒకటేనా? అని బీజేపీ నాయకులు ప్రశ్నలు సంధిస్తున్నారు. కార్పొరేషన్​గా అవతరించిన బడంగ్​పేట్​లో 32 డివిజన్​లలో జరిగిన మున్సిపల్​ ఎన్నికల్లో 13 స్థానాలను టీఆర్​ ఎస్​ దక్కించుకుంది. బీజేపీ 10, కాంగ్రెస్​ 7, స్థానాలతో సరిపెట్టుకోగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందారు. ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడంతో మేయర్​ పీఠం దక్కించుకోవడం కోసం రంగంలోకి దిగిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి 31 డివిజన్​ నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీ చేసిన మేయర్​ పారిజాత నర్సింహారెడ్డితో పాటు కాంగ్రెస్​ నుంచి గెలిచిన పెద్దబావి సుదర్శన్​ రెడ్డి, రాళ్లగూడెం సంతోషి శ్రీనివాస్​ రెడ్డిలతో పాటు, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ముత్యాల కృష్ణను టీఆర్​ఎస్​లో చేర్చుకున్నారు.

ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మేయర్​ పీఠం, స్వతంత్ర అభ్యర్థి ఇబ్రాం శేఖర్​లకు డిప్యూటి మేయర్​ పదవిలను కట్టబెట్టారు. అనూహ్య పరిణామాల వద్ద రాజకీయంగా చేస్తున్న కక్ష్య సాధింపు చర్యలకు ఒక తెలంగాణ బిడ్డగా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక బడంగ్​పేట్​ మేయర్​ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి టీఆర్​ఎస్​ ను వీడనున్నట్లు ప్రకటించి, గత జూలై 2వ తేదీన రాజీనామ చేశారు. ఢిల్లీలో రాహుల్​ గాంధీ సమక్షంలో మేయర్​ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్​ రెడ్డి, రాళ్లగూడెం సంతోషి శ్రీనివాస్​ రెడ్డిలతో కలిసి సొంతగూడు కాంగ్రెస్​ పార్టీలో చేరారు.

కాగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపధ్యంలో అవిశ్వాస తీర్మానం అంశం తెరమీదకు వచ్చింది. 32 కార్పొరేటర్ల సీట్లు ఉన్న బడంగ్​పేట్​లో అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 22 సీట్లు తప్పనిసరి. 10 సీట్లు ఉన్న బీజేపీ అవిశ్వాసం దిశగా అడుగులు వేస్తున్నారని, అవిశ్వాసం పెట్టినా తగిన సంఖ్యా బలం నిరూపించుకోవాల్సివస్తుంది. ఒకవేళ అవిశ్వాసం పెట్టినా ? మేయర్​ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఏవిధంగా ఎదుర్కొనబోతాడన్నది మిలియన్​ డాలర్ల ప్రశ్నగామారింది. మేయర్​ పై అధికార పార్టీ బీఆర్​ఎస్​ అవిశ్వాసం పెడుతుందా? లేదా ? అనేది కూడా వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed