- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పక్షంరోజులుగా స్టడీ మెటీరియల్ పంపిణీ..
దిశ, పరిగి : లక్ష్యం ఎంచుకొని చదివితేనే మన చదువుకు సార్థకత లభిస్తుందని డీసీసీబీ చైర్మన్ బయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. పరిగి మండలంలోని పరిగి, మాదారం, చిట్యాల గ్రామాల్లో సోమవారం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల్లో ఉన్నపేద విద్యార్థులను విద్యాపరంగా ప్రొత్సహించేందుకే తాను బీఎంఆర్ తరపున స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకొని మండల టాపర్లుగా నిలువాలన్నారు. మండల టాపర్ లుగా వచ్చిన విద్యార్థులకు బీఎంఆర్ ఫౌండేషన్ తరపున ప్రొత్సహక బహుమతి అందజేస్తామన్నారు. పరిగి నెంబర్ వన్ –1 హైస్కూల్ డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి మైక్ సెంట్ అందజేస్తానన్నారు.
పాలాది శ్రీనివాస్ గుప్త జిల్లా పరిషత్ హైస్కూల్కు మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం మాదారం గ్రామ మాజీ సర్పంచ్ చిల్కమర్రి వెంకటయ్య ఆధ్వర్యంలో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డికి ఘన స్వాగతం పలికి, మధ్యాహ్నభోజనం ఏర్పాటు చేశారు. విద్యాదానం చేస్తూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చి దిద్దేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని పాఠశాలలు డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డిని ప్రధానోపాధ్యాయులు కొనియాడారు. సుమారు 15 రోజులపాటు కుల్కచర్ల, పూడూరు, దోమ, గండేడ్, మహ్మదాబాద్, పరిగి మండలాల్లోని 60 పాఠశాలల్లో 4 వేల పై చిలుకు విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశానట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోవిందపురం అశోక్ వర్ధన్ రెడ్డి, ఎస్పీ బాబయ్య, దోమ రాంచెంద్రయ్య, మాణిక్యం, కనకం మొగులయ్య, ఈశ్వరప్ప, వెంకట్ రాంరెడ్డి, కుర్వ నరేష్ ఆయా గ్రామాల పెద్దలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.