ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జైన నాలుగేళ్ల చిన్నారి

by Dishanational2 |
ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జైన నాలుగేళ్ల చిన్నారి
X

దిశ, షాద్ నగర్: బైకును ఇసుక లారీ ఢీకొన్న సంఘటన‌లో నాలుగు సంవత్సరాల పాప దుర్మరణం పాలుకాగా తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామానికి చెందిన బోయపాటి ప్రశాంత్, దివ్య దంపతులు బైక్ పై హైదరాబాద్ వెళ్తుండగా కొత్తూరు మండలకేంద్రంలోని జహంగీర్ పీర్ దర్గా చౌరస్తా వద్ద అతివేగంగా వస్తున్న లారీ ప్రశాంత్ ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వారి నాలుగు సంవత్సరాల పాప నుజ్జు నుజ్జు కాగా, తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్ పరారయ్యాడు. అప్పటి వరకు అమ్మానాన్నలతో ఎన్నో కబుర్లు చెప్పిన చిన్నారి అంతలోనే దుర్మరణం పాలవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


Next Story