ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించడం లేదని.. రూ. 4 కోట్ల స్పోర్ట్స్ కారును తగులబెట్టిన దుండగులు

by Mahesh |
ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించడం లేదని.. రూ. 4 కోట్ల స్పోర్ట్స్ కారును తగులబెట్టిన దుండగులు
X

దిశ, బడంగ్‌పేట్: అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించడం లేదన్న అక్కసుతో రూ.80 లక్షల విలువైన స్పోర్ట్స్ కారును తగులబెట్టిన ఘటన పహాడీషరీఫ్ ​పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పహాడీషరీఫ్ ​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగ్‌కు చెందిన నీరజ్ అనే వ్యాపారి 2009 మోడల్‌కి చెందిన డిఎల్​09 సివి 3636 నెంబర్​గల లంబోర్ఘిని స్పోర్ట్స్​కారు‌ను సెకండ్​హ్యాండ్‌లో కొనుగోలు చేశాడు. ప్రస్తుతానికి ఆ కొత్త కారు సుమారు రూ.4 కోట్ల విలువ ఉంటుంది. ఆ కారుపై ఉన్న సోకు తీరగానే నీరజ్​విక్రయించాలనుకున్నాడు. ఈ నేపధ్యంలోనే తనకు పరిచయమం ఉన్న అయాన్​అనే వ్యక్తికి చెప్పారు.

దీంతో అయాన్ తన స్నేహితుడైన మొఘల్​పురాకు చెందిన అమన్‌కు చెప్పాడు. కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందని అమన్‌కు అతని మిత్రుడు అహ్మద్ తెలిపాడు. దీంతో మామిడిపల్లి టు శంషాబాద్ రూట్‌కు వెళ్లే రహదారిలో ఉన్న ఫాం హౌజ్‌కు తీసుకురావాలని అహ్మద్​చెప్పాడు. దీంతో నీరజ్​ దగ్గర నుంచి అయాన్​కారు తీసుకువచ్చి అమన్‌కు ఇచ్చాడు. దీంతో అమన్ అతని స్నేహితుడు హందాన్‌తో కలిసి జల్‌పల్లి‌లో ఆ స్పోర్ట్స్​కారును తీసుకుని మామిడి పల్లిలోని వివేకానంద స్టాచ్​దాటి ఎయిర్​పోర్ట్​రూట్‌లో మధ్యలో ఆపారు. అహ్మద్‌తో పాటు మరి కొంత మంది కారు వద్దకు చేరుకొని నీరజ్​ఎక్కడ ? అతను మాకు డబ్బులు ఇవ్వాలని దుర్భాషలాడారు.

నీరజ్‌ను పిలిపిస్తామని చెప్పిన వినకుండా అహ్మద్​వెంట వచ్చిన వారు బాటిలో తెచ్చుకున్న పెట్రోల్‌ను స్పోర్ట్స్ కారుపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అమన్​డయల్​100 కి ఫోన్​చేసి ఫిర్యాదు చేశారు. పహాడీషరీఫ్ ​పోలీసులు, ఫైర్​ఇంజన్​ ఘటనా స్థలికి చేరుకునే లోపే కారు పూర్తిగా దగ్ధమయ్యింది. సమాచారం అందుకున్న మహేశ్వరం ఏసీపీ పి.లక్ష్మీకాంత్ రెడ్డి, పహాడీషరీఫ్ ఇన్​స్పెక్టర్​గురువా రెడ్డి, ఎస్సై మధుసూదన్ ​ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అమన్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్​ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed