- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించడం లేదని.. రూ. 4 కోట్ల స్పోర్ట్స్ కారును తగులబెట్టిన దుండగులు
![ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించడం లేదని.. రూ. 4 కోట్ల స్పోర్ట్స్ కారును తగులబెట్టిన దుండగులు ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించడం లేదని.. రూ. 4 కోట్ల స్పోర్ట్స్ కారును తగులబెట్టిన దుండగులు](https://www.dishadaily.com/h-upload/2024/04/14/326409-car.webp)
దిశ, బడంగ్పేట్: అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించడం లేదన్న అక్కసుతో రూ.80 లక్షల విలువైన స్పోర్ట్స్ కారును తగులబెట్టిన ఘటన పహాడీషరీఫ్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పహాడీషరీఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగ్కు చెందిన నీరజ్ అనే వ్యాపారి 2009 మోడల్కి చెందిన డిఎల్09 సివి 3636 నెంబర్గల లంబోర్ఘిని స్పోర్ట్స్కారును సెకండ్హ్యాండ్లో కొనుగోలు చేశాడు. ప్రస్తుతానికి ఆ కొత్త కారు సుమారు రూ.4 కోట్ల విలువ ఉంటుంది. ఆ కారుపై ఉన్న సోకు తీరగానే నీరజ్విక్రయించాలనుకున్నాడు. ఈ నేపధ్యంలోనే తనకు పరిచయమం ఉన్న అయాన్అనే వ్యక్తికి చెప్పారు.
దీంతో అయాన్ తన స్నేహితుడైన మొఘల్పురాకు చెందిన అమన్కు చెప్పాడు. కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందని అమన్కు అతని మిత్రుడు అహ్మద్ తెలిపాడు. దీంతో మామిడిపల్లి టు శంషాబాద్ రూట్కు వెళ్లే రహదారిలో ఉన్న ఫాం హౌజ్కు తీసుకురావాలని అహ్మద్చెప్పాడు. దీంతో నీరజ్ దగ్గర నుంచి అయాన్కారు తీసుకువచ్చి అమన్కు ఇచ్చాడు. దీంతో అమన్ అతని స్నేహితుడు హందాన్తో కలిసి జల్పల్లిలో ఆ స్పోర్ట్స్కారును తీసుకుని మామిడి పల్లిలోని వివేకానంద స్టాచ్దాటి ఎయిర్పోర్ట్రూట్లో మధ్యలో ఆపారు. అహ్మద్తో పాటు మరి కొంత మంది కారు వద్దకు చేరుకొని నీరజ్ఎక్కడ ? అతను మాకు డబ్బులు ఇవ్వాలని దుర్భాషలాడారు.
నీరజ్ను పిలిపిస్తామని చెప్పిన వినకుండా అహ్మద్వెంట వచ్చిన వారు బాటిలో తెచ్చుకున్న పెట్రోల్ను స్పోర్ట్స్ కారుపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అమన్డయల్100 కి ఫోన్చేసి ఫిర్యాదు చేశారు. పహాడీషరీఫ్ పోలీసులు, ఫైర్ఇంజన్ ఘటనా స్థలికి చేరుకునే లోపే కారు పూర్తిగా దగ్ధమయ్యింది. సమాచారం అందుకున్న మహేశ్వరం ఏసీపీ పి.లక్ష్మీకాంత్ రెడ్డి, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్గురువా రెడ్డి, ఎస్సై మధుసూదన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అమన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.