రంజిత్ రెడ్డి మాట తప్పడు.. ఆశీర్వదించండి

by Disha Web Desk 11 |
రంజిత్ రెడ్డి మాట తప్పడు.. ఆశీర్వదించండి
X

దిశ, తాండూరు : ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తన భర్త రంజిత్ రెడ్డిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి ఆయన సతీమణి సీతాదేవి రెడ్డి చేశారు. శనివారం తాండూరు మున్సిపల్ పరిధిలో చేవేళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి తరపున ఆయన సతీమణి సీతాదేవి తాండూరు ఎమ్మెల్యే సతీమణి అరుణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కల్వ సుజాత, బీసీ సెల్ కన్వీనర్ సునీత సంపత్ లతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సీతాదేవి రెడ్డి మాట్లాడుతూ.. దేశమంతా కాంగ్రెస్ పాలనను కోరుకుంటుందన్నారు. సంపాదించుకోవడానికి రంజిత్ రెడ్డి రాజకీయాల్లో రాలేదని వెల్లడించారు.

ప్రజాసేవే లక్ష్యంగా, సేవ చేయాలని సంకల్పంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారన్నారు. చేవెళ్ల ప్రాంత అభివృద్ధికి రంజిత్ రెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కావాలా.. ప్రతిక్షణం ప్రజలకు అందుబాటులో ఉండి, మీకు తోడుండే గడ్డం రంజిత్ రెడ్డి కావాలా.. అని ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోవాలని ఆమె ఓటర్లకు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ ‘ పర్సన్ స్వప్న పరిమళ్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, నాయకులు మాధవి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed