రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి : జడ్పీ చైర్ పర్సన్

by Disha Web Desk 23 |
రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి : జడ్పీ చైర్ పర్సన్
X

దిశ,మహేశ్వరం: కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు అభివృద్ధి,సంక్షేమ పథకాలు లభిస్తాయని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి అన్నారు.బుధవారం మహేశ్వరం మండలంలోని నాగారం ,నందు పల్లి, గొల్లూరు ,నాగిరెడ్డిపల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానే దేశం అభివృద్ధి దిశలో పయనిస్తుందన్నారు.మహిళలు, యువకుల చూపు కాంగ్రెస్ పార్టీ వైపు మల్లిందన్నారు.చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story