- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పెండింగ్పనులు నెల రోజుల్లో పూర్తి చేయాలి: సబిత ఇంద్రారెడ్డి
దిశ, బడంగ్పేట్: మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్పేట్, మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలో పనులను వేగవంతం చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశించారు. ఆయా కార్పొరేషన్ల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పెండింగ్ పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. వివిధ పనులకు సంబంధించి రోడ్ల పక్కన తవ్వి పూడ్చకుండా వదిలేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల నాణ్యతలో రాజీపడవద్దని,ప్రజాప్రతినిధులు కూడా వాటిని తనిఖీ చేయాలన్నారు. ప్రతి పనికి సంబంధించిన ఒక నిర్ణీత గడువు పెట్టుకొని పూర్తి చేయాలన్నారు. ఆయా డివిజన్లలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయా కార్పొరేషన్లలో 13 కోట్ల 80 లక్షల బీటీ రోడ్డు పనులకు మంజూరు చేయించినట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో మీర్ పేట్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, బడంగ్పేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్ ,మున్సిపల్ కమిషనర్లు,కార్పొరేటర్లు,అధికారులు పాల్గొన్నారు.