కుమారుడికి పండ్లు ఇవ్వడానికి వెళ్తు తల్లి మృతి

by Disha Web Desk 23 |
కుమారుడికి  పండ్లు ఇవ్వడానికి  వెళ్తు తల్లి మృతి
X

దిశ, బడంగ్​పేట్​: రంజాన్​ సందర్భంగా హాస్టల్​ లో చదువుతున్న కుమారుడి కోసం స్కూల్​ బస్సు డ్రైవర్​కు పండ్లు ఇవ్వడానికి వెళుతున్న ఓ మహిళను వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాలీ ఆటో ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిన ఘటన బాలాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. బాలాపూర్​ ఇన్స్పెక్టర్​ బి. భాస్కర్​ తెలిపిన వివరాల ప్రకారం .. షాహీన్​ నగర్​ వాదియే హబీబ్​కాలనీ కి చెందిన పర్వీన్​ బేగం (35), మొహమ్మద్​ జుబేర్​ లు దంపతులు. వీరి కుమారుడు మహమ్మద్​ వజైర్​ (9) హాస్టల్​ లో చదువుతున్నాడు.

రంజాన్​ సందర్భంగా హాస్టల్​ లో చదువుతున్న కుమారుడి కోసం పండ్లు కొనుగోలు చేసింది. అల్ఫా స్కూల్​ బస్ డ్రైవర్​కు పండ్లు ఇస్తే తన కుమారుడుకి పండ్లు చేరవేస్తాని ఎంతో ఆశతో ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరింది. మార్గమధ్యలో హై వే హోటల్​ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన టిఎస్​ 07 యుజి 1491 నెంబర్​ గల అశోక్​ లేలాండ్​ ట్రాలీ ఆటో ఢీకొట్టంది. తీవ్రంగా గాయాలపాలైన పర్వీన్​ బేగం అక్కడికక్కడే మృతి చెందింది. ఈ కేసును బాలాపూర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed