- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కుమారుడికి పండ్లు ఇవ్వడానికి వెళ్తు తల్లి మృతి
దిశ, బడంగ్పేట్: రంజాన్ సందర్భంగా హాస్టల్ లో చదువుతున్న కుమారుడి కోసం స్కూల్ బస్సు డ్రైవర్కు పండ్లు ఇవ్వడానికి వెళుతున్న ఓ మహిళను వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాలీ ఆటో ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాలాపూర్ ఇన్స్పెక్టర్ బి. భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం .. షాహీన్ నగర్ వాదియే హబీబ్కాలనీ కి చెందిన పర్వీన్ బేగం (35), మొహమ్మద్ జుబేర్ లు దంపతులు. వీరి కుమారుడు మహమ్మద్ వజైర్ (9) హాస్టల్ లో చదువుతున్నాడు.
రంజాన్ సందర్భంగా హాస్టల్ లో చదువుతున్న కుమారుడి కోసం పండ్లు కొనుగోలు చేసింది. అల్ఫా స్కూల్ బస్ డ్రైవర్కు పండ్లు ఇస్తే తన కుమారుడుకి పండ్లు చేరవేస్తాని ఎంతో ఆశతో ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరింది. మార్గమధ్యలో హై వే హోటల్ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన టిఎస్ 07 యుజి 1491 నెంబర్ గల అశోక్ లేలాండ్ ట్రాలీ ఆటో ఢీకొట్టంది. తీవ్రంగా గాయాలపాలైన పర్వీన్ బేగం అక్కడికక్కడే మృతి చెందింది. ఈ కేసును బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.