మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన ఎమ్మెల్యేలు

by Disha Web Desk 20 |
మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన ఎమ్మెల్యేలు
X

దిశ, శంషాబాద్ : హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను బుధవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పై కేటీఆర్ తో, డాక్టర్ తో అడిగి తెలుసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి ప్రజాక్షేత్రంలో రావాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆకాంక్షించారు.

Next Story

Most Viewed