- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గంటసేపు మిషన్బగీరథ ట్యాంక్ ఓవర్ ఫ్లో... ఇండ్లలోకి చేరిన తాగు నీరు
దిశ, బడంగ్పేట్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ బగీరథను ప్రారంభించిన విషయం విధితమే. అంతేగాకుండా నీటిని పొదుపుగా వాడండి... ఆదా చేయండి అని తెలంగాణ ప్రభుత్వం ఒక వైపు చెబుతున్నా మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీలోని శ్రీరాంకాలనీలో మత్రం వాటర్వర్క్స్ అధికారులు నిమ్మెకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వివరాలలోకి వెళితే జల్పల్లి మున్సిపాలిటీలోని శ్రీరామ్కాలనీలో 18వ వార్డులో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా 24 జూన్ 2021లో మిషన్బగీరథ పథకం కింద 5లక్షల లీటర్ల సామర్ద్యం గల ట్యాంక్ను ప్రారంభించారు. వాటర్ ట్యాంక్ను ఇండ్ల మధ్యలో కట్టడంతో పాటు నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడంతో పెచ్చులూడుతున్నాయనే విమర్షలు వెల్లువెత్తుతున్నాయి.
కేవలం గంటన్నరలో వాటర్ ట్యాంక్లో కృష్ణా వాటర్ నింపి వెంటనే మోటర్ను ఆపివేయకపోవడంతో శుక్రవారం ఉదయం అదనంగా గంట సేపు 3లక్షల లీటర్ల కృష్ణావాటర్ నేలపాలయ్యాయి. వృధాగా పోతున్న నీటి కారణంగా పక్కనే జరుగుతున్న రెండు శుభాకార్యాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దిగువ ప్రాంతాలను కృష్ణావాటర్ ముంచెత్తింది. పలు ఇండ్లలోకి నీళ్లు చేరడంతో నిత్యావసరసరుకులు తడిచి ముద్దయ్యాయి. వీధులన్నీ జలమయమయ్యాయి. నెలకు రెండు సార్లు మిషన్ బగీరథ ట్యాంక్ నుంచి ఓవర్ ఫ్లో అవుతున్నా సంబంధిత వాటర్ వర్క్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము రోజు వారి కూలీలమని, నిత్యావర సరుకులన్నీ తడిచి ముద్దయ్యాయని వెంటనే తగిన నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.