చందనం చెరువును సందర్శించిన మంత్రి సబిత

by Dishafeatures2 |
చందనం చెరువును సందర్శించిన మంత్రి సబిత
X

దిశ, మీర్ పేట్: కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువును విద్యా శాఖ మంత్రి పి.సబిత ఇంద్రారెడ్డి మంగళవారం సందర్శించారు. చందనం చెరువుపై ఉన్న సదుపాయాలు ఎలా ఉన్నాయని వాకింగ్ చేస్తున్న పోలీస్ అభ్యర్థులను, వాకార్స్ ను ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈవెంట్స్ లో బాగా రాణించాలని ఆకాంక్షించారు. చందనం చెరువును బాగా అభివృద్ధి చేశారని వాకర్స్, స్థానికులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, కార్పొరేటర్లు అర్కల భూపాల్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు పల్లె జంగయ్య గౌడ్, టీఆర్ఎస్ నాయకులు శీను నాయక్, రవి గౌడ్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed