- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మోదీ వ్యక్తి కాదు.. శక్తి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
దిశ,తాండూరు : మోడీ అంటే వ్యక్తి కాదని, ఓ శక్తి అని చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశంసించారు.బుధవారం మేడే సందర్భంగా తాండూరు పట్టణంలోని మార్కెట్ యార్డులోని వర్తక సంఘం ప్రముఖులు, గుమస్తాలు హమాలీ సోదరులతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మే 13 న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతు తెలపాలని కోరారు. అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో మోడీ సర్కార్ ముందుందన్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేయడం అంటే అంతా ఆషామాషీ కాదని వారు ప్రజలకు వివరించారు. కమలం పువ్వుకు ఓటు వేసి నరేంద్ర మోడీని మూడవసారి ప్రధానమంత్రి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ , జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ , మల్లేశ్ , మాజీ మున్సిపల్ చైర్మన్ నాగారం నర్సింహులు , మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్ సాహు శ్రీలత, గౌతాపూర్ ఎంపిటిసి సాయి రెడ్డి, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, పట్టణ అధ్యక్షులు మల్లేశం, బొప్పి శ్రీహరి, అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ , వర్తక సంగం ప్రముఖులు, హమాలీ సోదరులు పాల్గొన్నారు