కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండ : రంజిత్ రెడ్డి

by Disha Web Desk 23 |
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండ :  రంజిత్ రెడ్డి
X

దిశ,శంషాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండ అని చేవెళ్ల ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. శంషాబాద్ మండలం మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య,మండల పార్టీ ఉపాధ్యక్షులు కోటేశ్వర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మహేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఘాన్సీ మియా గూడ మాజీ ఉప సర్పంచ్ ఇమ్రాన్, గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుడు కుమ్మరి దశరథ్ తో పాటు 200 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఎంపీ రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం దొరలపాలెంలో కొనసాగిందని గొప్పలు చెప్పడమే తప్ప అభివృద్ధి ఎక్కడ కనిపించలేదు అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ప్రభంజనంతో గెలిచే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల పథకాలను తీసుకువచ్చి 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కింది అన్నారు.

పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అభివృద్ధిని ప్రోత్సహిస్తుందన్నారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరని, మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి సత్తా చాటుతుందన్నారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త కలిసికట్టుగా పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన తీసుకెళ్లి ప్రతి ఒక్కరి చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీ ఓటు వేసే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు చెక్కల చంద్రశేఖర్, సిద్దేశ్వర ముదిరాజ్, హస్లీ రాములు నాయక్, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్, ఉప సర్పంచ్ సురేష్ నాయక్, ఆంజనేయులు, నరసింహ, రవి, ఇంద్రారెడ్డి, రఘు, నరసింహ, సాదిక్, వెంకటేష్, ఆనందం, రాజు, శ్రీకాంత్, సోము, రాజు, విగ్నేష్, శ్రీనివాస్, శంకరయ్య, వినోద్, రవీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story