- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సినీనటుడు రాజ్ తరణ్ ఇంటి వద్ద హై డ్రామా

దిశ, గండిపేట్ : గండిపేట మండలం కోకాపేటలోని సినీనటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. నగరంలోని మూసాపేట ప్రాంతం నుండి రాజ్ తరుణ్ ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు రాజేశ్వరి, బసవరాజు వచ్చారు. కొంతమంది కేర్ టేకర్స్ తో కలిసి వచ్చిన రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కోకాపేట కు రావడం తో స్థానికంగా ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం తయారైంది. ఇప్పటివరకు కిరాయి ఇంట్లో ఉంటున్న తాము సొంత ఇంటికి రావాలన్న ఉద్దేశంతో వచ్చామని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తెలుపుతున్నారు. అప్పటికే ఆ ఇంట్లో లావణ్య ఉంటుందని తెలుసని అయినా ఇల్లు విశాలంగా ఉన్నందున తాము అదే ఇంట్లో వేరొక గదిలో ఉండాలని వచ్చినట్లు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
కాగా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తనను ఈ ఇంటి నుండి గెంటివేయడానికి వచ్చారని లావణ్య ఆరోపించింది. తమకు సంబంధించిన కేసు కోర్టులో ఉందని అయినా తనపై దౌర్జన్యం చేయటానికి ఇక్కడికి వచ్చారని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కొంతమందితో కలిసి వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారని లావణ్య ఆరోపించారు. ఇంట్లోకి వస్తూనే సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని లావణ్య పేర్కొంది. గతంలో తానే రాజ్ తరుణ్ తో కలిసి ఉందామని చెప్పానని కలిసి ఉండడానికి వచ్చినట్లయితే తానెందుకు అడ్డుకుంటానని లావణ్య ప్రశ్నించింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు రాజేశ్వరి, బసవరాజులు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా లావణ్య అడ్డుకుంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి వచ్చిన తర్వాతనే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లోపలికి రావాలని లావణ్య స్పష్టం చేసింది.