కన్నుల విందుగా గోవిందుడి కళ్యాణం

by Disha Web Desk 15 |

దిశ, తలకొండపల్లి : మండలంలోని దేవుని పడకల్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కూతవేటు దూరంలో ఉన్న కళ్యాణమండపంలో గురువారం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల విందువుగా కొనసాగింది. స్వామి వారి కళ్యాణాన్ని వేద పండితులు రామాంజనాచార్యులు, గోపాలాచార్యుల మంత్రోచ్ఛరణల మధ్యన బాజా భజంత్రీలతో వైభవోపేతంగా జరిపించారు. కళ్యాణాన్ని తిలకించడానికి దేవుని పడకల్ గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ముఖ్య అతిథులుగా టీఎస్ పీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి దంపతులు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ దైవ సంకల్పం గొప్పదని నమ్మిన భక్తుల కోరికలు నెరవేర్చినప్పుడే ఆ దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఇంత చిన్న గ్రామంలో స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడం చూస్తుంటేనే ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మనం ఎంత కష్టపడి పనిచేసినా, సంపాదించినా చివరకు వారి ఇష్ట దేవుళ్లకు నమ్ముకొని ప్రార్థన చేయడం మన హిందూ సంప్రదాయమని గుర్తు చేశారు. అనంతరం

భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కేశవరెడ్డి, మెడికల్ షాప్ రాము, దేవాలయ కార్యనిర్వాహణాధికారి స్నేహలత, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త లట్టుపల్లి రాజ్ కుమార్, మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీశైలం, ఉప సర్పంచ్ తిరుపతి, లక్ష్మీనారాయణ, రాఘవేందర్, శంకర్, వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, రమాదేవి, అంజిరెడ్డి ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Next Story