శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయానికి మాజీ ముఖ్యమంత్రి

by Disha Web Desk 11 |
శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయానికి మాజీ ముఖ్యమంత్రి
X

దిశ, శంకర్ పల్లి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. జన్వాడలో ఆయనకు 1- 20 ఎకరాల భూమి ఉండగా దానిని ఆయన అమ్మి వేశారు. రిజిస్ట్రేషన్ చేసేందుకని ఆయన శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తాసిల్దార్ సురేందర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం ఆయన నగరానికి వెళ్లిపోయారు. కాగా ఆయన రిజిస్ట్రేషన్ చేసేందుకని తహసీల్దార్ కార్యాలయానికి రాగా, కార్యాలయ సిబ్బంది స్థానికులు ఎంతో ఆసక్తిగా ఆయనతో ఫోటోలు దిగారు.



Next Story

Most Viewed