దిశ ఎఫెక్ట్ …చెత్త వేస్తున్న వారికి జరిమానా విధించిన అధికారులు

by Disha Web Desk 11 |
దిశ ఎఫెక్ట్ …చెత్త వేస్తున్న వారికి జరిమానా విధించిన అధికారులు
X

దిశ అబ్దుల్లాపూర్మెట్ : మంగళవారం దిశ పత్రికలో ప్రచురితమైన వద్దన్న చోటే చెత్త డంపింగ్ కథనానికి స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ అధికారులు స్పందించారు. పెద్ద అంబర్పేట పరిధిలోని 24 వ వార్డు కుంట్లూరులో చెత్త వేయవద్దని సూచిక బోర్డులు పెట్టిన దగ్గరనే చెత్తను డంపు చేయడంతో దిశ పత్రిక కథనాన్ని ప్రచురించింది. స్పందించిన స్థానిక కౌన్సిలర్ కందడ అనుపమ, మున్సిపల్ అధికారులు సదరు ప్రాంతంలో చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానా విధించారు. రోడ్లపై చెత్త వేయకుండా ఇంటి వద్దనే మున్సిపాలిటీ చెత్త సేకరణ వారికి అందజేయాలని సూచించారు. చెత్తను రోడ్లపై వేయకూడదనే అవగాహన ప్రజల్లో వచ్చినప్పుడే చెత్త రహిత ప్రాంతాలుగా ప్రకటించబడతాయని అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.



Next Story

Most Viewed