ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత.. డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్ గుప్తా

by Dishafeatures2 |
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత.. డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్ గుప్తా
X

దిశ, ఆమనగల్లు: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని డీసీసీబీ డైరెక్టర్, సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేశ్ గుప్తా అన్నారు. మంగళవారం కడ్తాల్ పట్టణ కేంద్రంలో గురుస్వాములు చంద్ర నాయర్, వినోద్ లతో కలిసి గంప వెంకటేష్ ఆధ్వర్యంలో ఇరుముడి మహా పడిపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంప వెంకటేశ్ గుప్తా మాట్లాడుతూ.. దైవ కార్యక్రమాలు విశ్వశాంతికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందంగా ఉండాలని అయ్యప్వ స్వామిని వేడుకున్నారు. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ప్రతి రైతు ఇంట్లో సిరులు పండాలని కోరుకున్నారు. అనంతరం అయ్యప్ప శబరి యాత్రకు బయలుదేరుతున్న అయ్యప్ప స్వాములను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి,వార్డ్ సభ్యులు గణేష్, కర్తల్ మండల బీసీ ప్రెసిడెంట్ వెంకటేష్, కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ, అయ్యప్ప స్వాములు రాజు జగదీష్, సురేష్ సాయినాథ్, మహేష్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed