రోడ్డు ఇలా ... వెళ్లేది ఎలా.. గతుకుల రోడ్డుతో నరకయాతన

by Disha Web Desk 23 |
రోడ్డు ఇలా ... వెళ్లేది ఎలా.. గతుకుల రోడ్డుతో నరకయాతన
X

దిశ,కొందుర్గు: ఆ గతుకుల రోడ్డుపై ప్రయాణం సాగించేందుకు వాహనదారులు ప్రతినిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు.కాంట్రాక్టర్ పనులు చేయకుండా వదిలివేయడంతో ఆ రోడ్డు ద్వారా రాకపోకలు సాగించాలంటే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వివరాలలోకి వెళితే చౌదరి గూడెం నుంచి తూంపల్లి మీదుగా కొందుర్గు కు వెళ్లే రహదారి ప్రయాణికుల పాలిట ప్రాణ సంకటంగా మారింది.గత ప్రభుత్వ హయాంలో రీ బిటి కోసం పనిని తీసుకున్న కాంట్రాక్టర్ రోడ్డును తవ్వి పనులు చేయకుండా వదిలివేశాడు. దీంతో ఆ రోడ్డు గుండా వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి.రోడ్డును మధ్యలో మూడు ఫీట్లు బీటి ఉంచి రెండు వైపులా రోడ్డు తవ్వి వదిలేశాడు. రోడ్డు పనులు చేయడం లేదు.

దీంతో ఆ దారి ప్రమాదాలకు నిలయంగా మారింది.చౌదరి గూడెం నుంచి తూంపల్లి ద్వారా కొందుర్గు వెళ్తే రెండు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.దీంతో ద్విచక్ర వాహనాలు,ఆటోలు, ఈ రోడ్డు ద్వారా వెళ్తుంటారు. ఉన్న రోడ్డును తవ్వి గుంతలమయంగా చేయడంతో ప్రయాణికులు అతి కష్టంగా వాహనాలను నడిపిస్తున్నారు.దీనికి తోడు క్రషర్ మిషన్ నుంచి భారీ వాహనాలు నిత్యం ఈ దారి గుండా వెళ్తుంటాయి.రోడ్డు మరీ అద్వానంగా తయారైంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆ కాంట్రాక్టర్ తో రోడ్డు పనులు పూర్తి చేయించి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.



Next Story

Most Viewed