- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మాజీ గవర్నర్ కొడుకు, మనువడు పై కేసులు నమోదు
దిశ, బడంగ్పేట్: మామిడిపల్లిగ్రామంలో స్థల విషయంలో జరిగిన ఘర్షణలో కిరాయిగుండాలచే దాడులు చేయించిన మాజీ గవర్నర్ కుమారుడు, మనువడులపై పహాడిషరీఫ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రాళ్ళదాడులతో పాటు బైక్లను దగ్దం చేసిన 14మంది కిరాయి గుండాలను పోలీసులు అదుపులోకి తీసుకుని బుధవారం రిమాండ్కు తరలించారు. పహాడిషరీఫ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మామిడిపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 324లోని 14గుంటల ప్రయివేట్స్థలం.. దారి విషయంలో మాజీ గవర్నర్పి.శివశంకర్కుమారుడు డాక్టర్ వినయ్కుమార్వర్గం, మామిడి పల్లి గ్రామానికి చెందిన సతీష్గౌడ్ వర్గంల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపధ్యంలోనే మాజీ గవర్నర్ కుమారుడు పి.శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్కుమార్,తన కుమారుడు పుంజాల శాశ్వత్లు పాతబస్తీతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన కిరాయి గుండాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం డాక్టర్వినయ్కుమార్, శాశ్వత్లు సన్సిటికి చెందిన ఫరాన్షఫీ రుకాదియా (40), బండ్లగూడకు చెందిన ఇమ్రాన్ఖాన్(24), చార్మినార్కు చెందిన మొహమ్మద్జుబేర్(25), లంగర్హౌజ్కు చెందిన మాదుగని మహేష్(26), బహదూర్పురాకు చెందిన షేక్జమీల్( 30), శాస్త్రి పురంకు చెందిన మొహహ్మద్అబ్దుల్ఫహద్(27), బహదూర్పురాకు చెందిన మొహమ్మద్సిమ్(26), వట్టేపల్లికి చెందిన మొహహ్మద్ఆలీ (36), షాహిన్నగర్కు చెందిన షేక్హైదర్(23), ఖాద్రిచమాన్కు చెందిన మొహమ్మద్ఆలీ ఉద్దీన్(35), ఫలక్నుమాకు చెందిన రహమతుల్లాఖాన్(37), హఫీజ్నగర్కు చెందిన షేక్ ముజామిల్ఉద్దీన్ (20), సాదత్నగర్కు చెందిన మొహమ్మద్ ఖాళీద్(30), షాహిన్నగర్కు చెందిన మొహమ్మద్ సాజిద్ (27) లతో కలిసి మామిడి పల్లిలోని ఆ వివాదస్పద స్థలానికి చేరుకున్నారు.
ఈ విషయం తెలసుకున్న మామిడిపల్లి గ్రామానికి చెందిన సతీష్గౌడ్వర్గం అక్కడికి చేరుకుంది. దీంతో డాక్టర్ వినయ్కుమార్ తరపున వచ్చిన కిరాయి గుండాలు మొదట సతీష్గౌడ్ వర్గంపై రాళ్లదాడులు చేశారు. ఆగ్రహించిన సతీష్గౌడ్వర్గం కూడా పరస్పర రాళ్ళ దాడులకు పూనుకున్నాయి. అల్లరి మూకల దాడిలో రెండు బైక్లు అగ్నికి ఆహుతి అవ్వగా మరి కొన్ని బైక్లు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న పహాడిషరీఫ్పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దాడులకు పాల్పడ్డ 14 మందిని అదుపులోకి తీసుకుని బుధవారం రిమాండ్కు తలరించారు. పరారీలో ఉన్న డాక్టర్ వినయ్కుమార్, శాశ్వత్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును పహాడిషరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.