- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జల్పల్లి టూ చైనా.. అధికారుల రైడ్లో వెలుగులోకి సంచలన విషయాలు
దిశ, బడంగ్పేట్: జల్పల్లి మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న కోల్డ్స్టోరేజ్కేంద్రాలపైమున్సిపాలిటీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. జల్పల్లి మున్సిపాలిటీ కమిషనర్జిపి కుమార్బృందం వివిధ శాఖల అధికారులతో కోల్డ్స్టోరేజ్కేంద్రాలపై నిర్వహించిన దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి, వెటర్నరీ సర్టిఫికెట్, ఫైర్ ఎన్వోసీ, ఎక్స్ ఫోర్ట్ సర్టిఫికెట్, సెంట్రల్ ఎక్సైజ్ సర్టిఫికెట్, కన్ స్ట్రక్షన్ సర్టిఫికెట్ తదితర ఎలాంటి అనుమతులు లేకుండా పశువుల మాంసంతో పాటు విడి భాగాలను చైనా, బంగ్లాదేశ్, అరబ్దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించారు.
భారతదేశం నుంచి చైనాకు ఎగుమతులు.. దిగుమతులు నిషేదించినా అక్రమమార్గంలో పశుమాంసాన్ని ట్రక్కులు.. ఏసీ కంటెయినర్లు.. బోట్ల ద్వారా జల్పల్లి మున్సిపాలిటీ నుంచి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఈ రోజు ప్యాకింగ్చేసిన మాంసాన్ని నెల రోజుల తర్వాత తేదీని ముద్రించి విదేశాలకు తరలిస్తున్నట్లు కనుగొన్నారు. ఇప్పటి వరకు జల్పల్లి మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 12 కోల్డ్స్టోరేజ్లను సీజ్చేశారు. కోల్డ్స్టోరేజ్నడుపుతున్న బడాబాబులు పరారీలో ఉండగా.. నలుగురు వ్యక్తులను బాలాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.