పేకాట రాయుళ్ల అరెస్ట్…

by Disha Web Desk 11 |
పేకాట రాయుళ్ల అరెస్ట్…
X

దిశ, ఇబ్రహీంపట్నం :- రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామం శివారులో కొంతమంది వ్యక్తులు కలిసి పేకాట ఆడుతున్నరన్న సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం ఎస్సై తన సిబ్బందితో వెళ్లి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుండి, 6,500/- రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు, 3 మోటార్ సైకిళ్ళు, 2 సెట్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు.



Next Story