భార్య విడిచి వెళ్లిందని వ్యక్తి ఆత్మహత్య

by Disha Web Desk 15 |
భార్య విడిచి వెళ్లిందని వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, పరిగి : మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పరిగి మండలం బర్కత్​ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చన్గొముల్​ నర్సింహులు (30)కు హైదరాబాద్​ కు చెందిన మహిళతో కొంతకాలం క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. కొద్ది రోజుల క్రితం భార్య, తన కూతురుతో కలిసి భర్తను విడిచి వెళ్లిపోయింది. భార్య వెళ్లి పోయినప్పటి నుంచి చన్గొముల్ నర్సింహులు మనస్తాపానికి గురయ్యాడు. జీవితంపై విరక్తి చెంది శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని మృతి చెందాడు. ఆత్మహత్య చేసుకున్న నర్సింహులుకు తండ్రి పాపయ్య, తల్లి చంద్రమ్మ ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్​ఐ విఠల్​ రెడ్డి తెలిపారు.


Next Story

Most Viewed