- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు: నివేదిక విడుదల చేసిన రజత్ కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని ఇరిగేషన్ స్పెషల్ చీఫ్సెక్రెటరీ రజత్ కుమార్వెల్లడించారు. శుక్రవారం ఈ ఏడాదికి సంబంధించిన గ్రౌండ్ వాటర్రిసోర్సెస్ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడేళ్లలో రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం 4.26 మీటర్లకు పైగా పెరిగిందని నివేదికలో తేలిందని, మొత్తం సేకరించిన భూగర్భ జలాల లభ్యత 680 టీఎంసీ దగ్గర ఉందన్నారు.
గతంతో పోల్చితే భూగర్భ జలాల వెలికితీత 8% తగ్గిందని, రాష్ట్ర ప్రభుత్వం పలు విధాలుగా చేస్తున్న ప్రయత్నాలతో నీటి మట్టాలు పెరిగాయని, మిషన్ కాకతీయ కింద 27472కు పైగా చెరువులను పునరుద్ధరించామని, కాళేశ్వరం ఎత్తిపోతలతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. చెరువులు నింపడం, చెక్ డ్యాములు, పెర్కోలేషన్ ట్యాంకులు, ఇంకుడు గుంతల వంటి వాటితో నీటిమట్టాలు పెరిగాయన్నారు. ఈ భూగర్భ జల వనరుల వినియోగం కోసం పక్కా ప్రణాళిక వేస్తున్నామని, భూగర్భ జలాలు, పరిశ్రమలు, వ్యవసాయం, పంచాయతీ రాజ్ శాఖలతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు రజత్ కుమార్ వెల్లడించారు.