బీజేపీ ఆఫీస్ బేరర్ల మీటింగ్‌లో రాజగోపాల్ రెడ్డి ప్రత్యక్షం

by Disha Web Desk |
బీజేపీ ఆఫీస్ బేరర్ల మీటింగ్‌లో రాజగోపాల్ రెడ్డి ప్రత్యక్షం
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ ఆఫీస్ బేరర్ల మీటింగ్‌లో ఉన్నట్టుండి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యక్షమయ్యారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కిష్టాగూడెం వద్ద నిర్వహించిన పదాధికారుల ముఖ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాషాయతీర్థం పుచ్చుకోక ముందే కీలక సమావేశానికి హాజరుకావడంతో ఇతర నేతలు, ప్రజలు ఒకింత షాకయ్యారు. ఎప్పుడైనా చేరక తప్పదు కదా అని ముందే వచ్చేశాడేమోనని చర్చించుకున్నారు.

వాస్తవానికి ఈనెల 21వ తేదీన మునుగోడు సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన కమలం గూటికి చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు షురూ చేస్తున్నారు. అమిత్ షా సభకు జన సమీకరణ, ఏర్పాట్లకు బండి సంజయ్ కమిటీలు సైతం వేశారు. మునుగోడు నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి ఇద్దరు చొప్పున 9 మండలాలకు 18 మందికి ఇన్ చార్జీల బాధ్యతలు అప్పగించారు. కానీ రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టుండి కీలక సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశమైనా అంతా తమ మంచికే అని బీజేపీ శ్రేణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కీలక మీటింగ్ కు హాజరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మెడలో కాషాయ కండువా లేకుండానే కనిపించడం గమనార్హం.


Next Story

Most Viewed