సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పీవీ సింధు.. వివాహానికి రావాలని ఆహ్వానం

by Mahesh |
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పీవీ సింధు.. వివాహానికి రావాలని ఆహ్వానం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత షెట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఈ రోజు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కుటుంబ సభ్యులతో సీఎం నివాసానికి వెళ్లిన సింధు ఈ నెల 22న రాజస్థాన్ లో జరిగే తన వివాహానికి రావాలని.. సీఎంకు శుభలేఖ అందించి ఆహ్వానించి ఆహ్వానం పలికారు. కాగా ఈ రోజు మధ్యహ్నం కుటుంబ సభ్యుల నడుమ ఎంగేజ్‌మెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ సింధు, వెంకట దత్తసాయి రింగ్స్‌ మార్చుకున్నారు. ఎంగేజ్‌మెంట్‌ ఫొటోను సింధు ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) వేదికగా అభిమానులతో పంచుకున్నది. "ఒకరి ప్రేమ దక్కిన సమయంలో.. తిరిగి మనం ప్రేమించాలి" అని క్యాప్షన్‌తో ఫొటోను షేర్‌ చేసింది. ఎంగేజ్‌మెంట్‌ సందర్భంగా ఇద్దరూ కేక్‌ కట్‌ చేశారు. సింధు వివాహ వేడుక ఈ నెల 22న రాజస్థాన్‌(Rajasthan)లో ఉదయ్‌పూర్‌(Udaypur)లోని ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed