పీడీఎస్‌యూ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక..

by Disha Web Desk 13 |
పీడీఎస్‌యూ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్‌యూ) రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. డిసెంబర్ 7, 8 తేదీల్లో జరిగిన రాష్ట్ర మహాసభలు ముగిశాయి. అనంతరం జరిగిన సంస్థగత కార్యక్రమాల్లో గత కార్యక్రమాలను సమీక్షించుకుని భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమం తీవ్రతరం చేయాలని, సమాజంలో పెరుగుతున్న కుల, మత, లింగ వివక్షలకు వ్యతిరేకంగా పోరాడాలని, పలు సమస్యలపై ఉద్యమాలు నిర్వహించాలని తీర్మానాలు చేశామని రాష్ట్ర కమిటీ శుక్రవారం మీడియా కు తెలిపింది.


పీడీఎస్‌యూ అధ్యక్షుడిగా పి. రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఎన్. ఆజాద్, ఉపాధ్యక్షులు, పృథ్వీ, భాస్కర్, అనిల్, నరేందర్, నర్సింహారావు, కార్యదర్శులు గణేష్, సంధ్య, సాయి, అఖిల్, ప్రవీణ్, కోశాధికారిగా సురేష్‌ను ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు హలీం పాష (గద్వాల్), హరీష్ (గద్వాల్), వెంకటేష్ (వనపర్తి), సీతారాం (మహబూబ్‌నగర్), అజయ్(నారాయణపేట), సంధ్య(నారాయణపేట), వెంకటేష్(ఖమ్మం), దీపిక(ఖమ్మం), నవీన్(ఖమ్మం), సతీష్(ఖమ్మం), నరేందర్(కొత్తగూడెం), రాకేష్(హైదరాబాద్), పవిత్ర(హైదరాబాద్), తిరుపతి(హైదరాబాద్), నరేష్(వరంగల్), భూక్యా సంతోష్(మహబూబాబాద్), హరీష్(ఆదిలాబాద్), సింహాద్రి(సూర్యాపేట), గణేష్, అశూర్, అనిల్(నిజామాబాద్)లను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.


Next Story

Most Viewed