అంధ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

by Disha Web Desk 11 |
అంధ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంధ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హాస్టల్ విద్యార్థి జాక్ ఆధ్వర్యంలో వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్‌ శైలజ, కార్పొరేషన్ చైర్మన్ వాసు దేవరెడ్డితో సమస్యలపై చర్చలు జరిపారు. గత ఐదు రోజులుగా నలుగురు అంధ విద్యార్థులు నాలుగు ప్రభుత్వ హాస్టల్లో కనీస వసతులు, అధికారుల వేధింపులు, నిర్లక్ష్య వైఖరిపై అన్నం మాని ఉపవాసం సమ్మె చేస్తున్నారని వెల్లడించారు. అంధుల హాస్టళ్లలో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి ముత్తినేని వీరయ్య వివరించారు. అంధులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సదుపాయాలు అందడం లేదన్నారు. శాఖ కమిషనర్, కార్పొరేషన్ చైర్మన్ సమస్యలన్నింటినీ నెల రోజుల్లో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ జాక్ విద్యార్థి నాయకులు అర్జున్, శ్యామ్, గాయత్రి, రమణమ్మ, నీలా బాయ్, అనూష, కిశోర్, లింగ స్వామి, వీరన్న, లాల్ అహ్మద్, భాస్కర్, పాషా, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed