ప్రధాని తెలంగాణ పర్యటన.. 70 నియోజకవర్గాల్లో ఆ ప్రచారం..

by Sathputhe Rajesh |   ( Updated:2022-11-09 03:20:11.0  )
ప్రధాని తెలంగాణ పర్యటన.. 70  నియోజకవర్గాల్లో ఆ ప్రచారం..
X

దిశ, వెబ్ డెస్క్: ఈనెల 12న ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రైతే రాజు అనే పేరుతో రాష్ట్ర బీజేపీ కార్యక్రమాన్ని తలపెట్టింది. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన తర్వాత ప్రధాని ప్రసంగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లను అమర్చి ప్రధాని ప్రసంగాన్ని ప్రజలు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ఇప్పటికే బీజేపీ ప్రణాళిక రూపొందించింది. ఎరువుల సబ్సిడీ, కిసాన్ సమ్మాన్ నిధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు చేపట్టనున్నారు.



Next Story

Most Viewed