- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రధాని మోడీ పర్యటన.. గనుల్లో నల్ల బ్యాడ్జీలతో టీబీజీకేఎస్ నిరసన..

దిశ, తాండూర్ : ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం పర్యటనకు నిరసనగా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించారు. బెల్లంపల్లి ఏరియాలోని అబ్బాపూర్, కైరిగూడ ఓపెన్ కాస్టులు, వివిధ డిపార్ట్మెంటులో గురువారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనలు నిర్వహించారు. టీబీజీకేఎస్ నాయకులు మాట్లాడుతూ సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ, కార్మికుల హక్కులను రక్షించే చట్టాలను నల్ల చట్టాలుగా మార్చిన ఘనత కేంద్రానికే దక్కిందన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించే మోడీ సంవత్సరం క్రితమే ప్రారంభమైన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించే నేపంతో తెలంగాణలో అడుగు పెట్టడం విడ్డురంగా ఉందన్నారు.
సింగరేణి కార్మికులకు రావలసిన వేజ్ బోర్డు సమస్య పరిష్కరించాలని, ఇన్కమ్ టాక్స్ను రద్దు చేయాలని కోరిన కేంద్రం స్పందించడం లేదన్నారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటు వారికి వేలంలో కేటాయించడం వలన సింగరేణి నిర్వీర్యమై తెలంగాణ ప్రాంతంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణకు పరిశ్రమలు, బొగ్గు బ్లాకులను కేటాయించి గని కార్మికుల హక్కులను పరిరక్షించి పీఎం తెలంగాణలో అడుగు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రావు, సెంట్రల్ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రకాష్ రావు, నాయకులు శ్రీనివాస్, కార్నాధం వెంకటేశం, రమేష్, చంద్రయ్య, వైకుంఠం, చందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: తెలంగాణలో మోడీ.. ఢిల్లీ టూర్కు కేసీఆర్ ప్లాన్?